నా బ్లాగుని శోధించండి


Home హస్యాంజలి Free Software links My Orkut My FaceBook కూడలి
రాంగోపాల్ బ్లాగుకి స్వాగతం...

20, అక్టోబర్ 2009, మంగళవారం

పొగ'బారిన' హృదయాలు



"పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్ " ఈ వాక్యం వినగానే మనకు కన్యాశుల్కంలోని గిరీశం క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది.ఆనాడు గురజాడగారు అప్పటి సామాజికపరిస్తితులను కల్లకుకట్టినట్టుగా కన్యాశుల్కం నాటకంలో చూపించారు. ఆ నాటకం అప్పటి నుండి ఇప్పటివరకు ఎంతో పాపులర్. అలాగే పోగారయుల్లకి గిరీశం క్యారెక్టర్ కుడా అంతే పాపులర్, ఎంతగా అంటే తమను సమర్దించే వ్యక్తి తమవెంటే ఉన్నాడన్నంతగా కాని, ఒక్క విషయం సరదాగా పొగతో మేగాలు శ్రుష్టిస్తున్న పొగరాయుళ్ళు చివరికి పొగ వల్ల మేగాల్లో కలిసి పోయే రోజు వస్తుందని తెలిసి కూడా వారి సరదాని మార్చుకోవడానికి ఇష్టపడరు.

ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్పలకుంటున్నాను ఒక కుక్కగారు తిరిగి తిరిగి అలసిపోయి ఒక ప్రదేశంలో ఇనపమొలున్నది చూడకుండ కూర్చున్నదట మొల తనకు గ్రుచ్చుకున్న అక్కడినుండి లేవకుండ అక్కడే కూర్చున్నదట ఈ విషయాన్నీ గంటసేపటినుండి గమనిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఇలా అంటున్నాడు ఒరేయ్ గంటసేపటినుండి ఆ కుక్క మొలపైన కూర్చొని అరుస్తుందిగాని అక్కడినుండి లేవడంలేదు ఎందుకని? దానికి రెండో వ్యక్తి ఇలా చెపుతున్నాడు ఆ కుక్కగారికి మొలవల్లవచ్చేనోప్పి సరిపోవడం లేదురా దానికి సరిపడే నొప్పి రాగానే అదే అక్కడినుండి లేచిపోతుందిలే అన్నాడట. అలాగే పొగరాయుళ్ళు కూడా చిన్నప్పుడు పోగాత్రగే వాల్లనుచుసి సరదాగా పొగత్రాగడం అలవాటు చేసుకుంటారు. మొదట్లో దగ్గు వచ్చిన, కళ్లు తిరిగిన తీయని భాధగా భరిస్తారు. అలవాటుగా మారినప్పుడు ఇతరులు దానివల్ల కలిగే చేడు చెప్పినా గాని వినిపించుకోరు. అలవాటు ముదురి ఉపిరితిత్తుల క్యాన్సుర్గా మారితే గాని వారికీ తెలియదు. కుక్క గారి నొప్పిలగా.
బస్సులో, సినిమాహలల్లో, రైల్వేస్టేషన్లలో ఇంకా, ఇతర ప్రాంతాలలో పొగత్రాగరాదు అనే స్లోగన్ చూసి అలవాటు లేని వారేమో ఇక్కడ పొగత్రాగడం నిషిద్దం అనుకుంటారు. కాని, అలవాటు ఉన్నవారు కాలిగా ఎందుకు ఉన్నావు పొగత్రాగరాదు అనుకుంటారేమో తెలియదు గాని ఎదేచ్చగా సిగరెట్టో, బీడియో జేబులోంచి తిసి అంటించి గుప్పు గుప్పుమని చిన్నపిల్లలు, ఆడవాళ్ళని కూడా చూడకుండా వారిపైకి పొగ ఉదుతారు. కాని వారికి తెలుసు పోగాత్రగే వారికన్నా దానిని పీల్చుకున్న వారిపైనే ఎక్కువ ప్రబావం చూపిస్తుంది. అయినా వారి సరదా వారిదే. ఎవరైనా వద్దని సలహా ఇస్తే చెప్పేవారికి వినేవాడు లోకువ అని సమర్దించుకుంటారు.
కాని
వారు కాల్చేది పొగాకు గొట్టం కాదు, వారి ఆయుషు అని గుర్తుంచుకోవాలి. పోయేది తమ ప్రాణమేననివెర్రిగా అనుకోకుండా వారిపైన ఆధారపడే బార్య బిడ్డలు అనాధలౌతారని గుర్తుంచుకోవాలి.

సిగరెట్టు
, బేడీలు వాటి తమ్ముళ్ళు (గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు) స్లో ఫాయిజన్ లాంటివి. మెల్లగా మెల్లగా వాటిని ఉపయోగించే వాళ్ళే గుర్తించకుండా వారి ఆరోగ్యాన్ని హరిస్తాయి. ఎ అలవాటు లేని వారు కూడా అన్ని చేడు అలవాట్లు ఉన్నా వారికన్నా ముందే పోవచ్చు. వాళ్ళను చూపించి మన చెడుఅలవాట్లను సమర్తించుకొని జీవితాన్ని అన్ని విధాల ఆస్వదిస్తమనుకుంటే మనం చదివే చదువులకు అర్థంలేనట్టే ఎందుకంటే పుట్టిన ప్రతివాడు పోయేవాడే అలాగని వున్నదంతా తినలేముగా ఎంతో కొంత రేపటి కోసం దాచుకుంటాం. అలాగే ఆరోగ్యాన్ని కూడా రేపటి కోసం కాపాడుకుంటే తప్పేముంది.
సినిమాల్లో క్లైమాక్సులో పోలిసుల్లా మన ప్రభుత్వం మొదట పొగాకు ఉత్పత్తి కంపెనిలకు అనుమతి ఇచ్చి, ఇప్పుడు పుర్రె, తెలు బొమ్మలతో ప్రజల్లో పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రచారం చేస్తుంది. ప్రజలపై అంత మమకారం ఉన్నా ప్రభుత్వం ఎందుకు మొదట పొగాకు ఉత్పత్తులకు అనుమతి ఇచ్చారు? ఇప్పుడు చేతులు కాలాక పుర్రెలు ఎందుకు పట్టుకోవాలి. ఏధి ఏమైన ఇప్పటికైనా కళ్లు తెరచిన పాలకులకు మన అభినందనలు తెలుపుదాం.

భీడి
కొందరి ఆయుషు తగ్గిస్తుంటే మరికొందరు బీదభీడి కార్మికుల ఆకలి తీర్చి అయిషుపెంచుతుంది వారికదే జీవనోపాధి. అందువల్ల పోగాకుపై మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నముందుగా బీద బీడీ కార్మికుల జీవనోపాధికి ఇతర మార్గాలు చూపిన తర్వాతే పుర్రె గుర్తుపై ప్రయోగాలు చేయాలనీ ఆశిద్దాం.

14, అక్టోబర్ 2009, బుధవారం

బాల కార్మికులు

స్వాతంత్ర్యం షష్టి పూర్తి చేసుకున్న మనం మాత్రం పసిపాపలను బాలకార్మికులుగా చూస్తున్నాము, మారుస్తున్నాము.బ్రిటిష్ వాళ్ల నుండి స్వేచ్చ పొందామే గాని, పసిపిల్లలకు స్వేచ్చ ఇవ్వలేకపోతున్నాము. 60వత్సరాల స్వేచ్చ వాయువులు పిలుచుకున్నభారతావనిలో స్వేచ్చ అంటే ఎరగని చిన్నారులను చూస్తున్నాం.
దేవుని గుడిలో దండం పెట్టి బయట కనిపించే చిన్నారులకి రూపాయో అర్ధరూపాయో చేతిలో పెట్టి "కిలో పాపం" కదిగెసుకున్తునామ్ అనుకుంటున్నమేగాని, ఆ పిల్లలు ఆకలి భాధ భరించలేక బాల కర్మికులుగాను, ఆకాస్త పని కూడా లేనప్పుడు చేయిచాచి అర్దించే చిట్టి చేతులను పొద్దున లేచినప్పడినుంచి, నిద్ర పోయేవరకు స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావులు పుట్టిన ఈ గడ్డపైన చూస్తూ మౌనంగా ఉంటున్నాం.
కారణం, ఒకే ఒక్క ప్రశ్న నకెందుకులే?
ఔను! ఇదే ప్రశ్న స్వరాజ్యం కోసం పోరాడిన గాంధీ మహాత్మునికో, మన తెలుగువాడు అల్లూరి సీతారామరాజుకో, ఇంకా ఎందరో మహానుభావులకో వచ్చి ఉంటే ఇవాళ మన నేలపైనే మనమందరం భానిసలుగా ఉండేవాళ్ళం. భానిస సంకేల్లనుండి విముక్తి పొందిన మనం, బాల కార్మికులకు మాత్రం విముక్తి ప్రసాధించలేకపోతున్నాం. అల ఆలోచిస్తే దినిని నివారించడం మనకు పెద్ద సమస్యేమీ కాదు,నివారించాలని ఆలోచించకపోవడమే మనం చేస్తున్న ఆలస్యం.
మనలో కొందరు అనుకోవచ్చు నా ఒక్కడి వల్ల ఏమౌతుందని కానీ, ఒక్కొక్క చుక్క నీరు కలిస్తేనే సముద్రమౌతుందని మనందరికీ తెలిసిన విషయమే, విషయాన్నీ మరొక్కసారి గుర్తు చేసుకుంటే నా వల్ల ఎమౌతుందన్న ఆలోచన రాదు.
భారతమాత భిడ్డలారా నాతోబుట్టువులార మనమందరం కలిసి మన ప్రయత్నం ఈ రోజు నుండే ప్రారంభిద్దాం

ఇప్పుడు
బాల కార్మికులుగా మారడానికి గల కారణాలు ఆలోచిద్దాం.
1.అతి ముఖ్య కారణం పేదరికం:- రెక్కాడితే గాని డొక్కాడని భిద కుటుంభాలలో బార్యబర్తలు కష్టం వారి కుటుంబ కనీసఅవసరాలకు చాలక వారి పిల్లలను లేత వయసులోనే పాఠశాలకి బదులు పనికి పంపి బాల కార్మికులుగా కన్నాతల్లిధన్రులె మరుస్తునారు. విషయాన్నీ చూస్తే చెట్టు ఆకులను తెంపి చెట్టుకే ఎరువుగా వేసినట్టుంది కదా!
2. అనాథ పిల్లలు:- కామంతో కొవ్వెక్కిన ' ఒక మగ ఒక ఆడ' చేసిన తప్పుకి చెత్త కున్దిలనే తల్లిగా ఇల్లుగా మార్చుకున్న పిల్లలు బాల కార్మికులుగానో, ముష్టి పిల్లలుగానో, దొంగలుగానో మారుతున్నారు. ఇంకా మనం గ్రహించని కారణాల వల్ల కూడా "" అంటే అమ్మ, "" అంటే ఆవు అని పలకాల్సిన నోటితో "" అంటే అన్నం "" అంటే ఆకలి అని పలకాల్సివస్తుంది.
ఐతే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మనమేమి చేద్దామంటే :-
1.మన చుట్టూ కనిపించే భిద కుటుంభాలకి చేతనైన సహాయం చేసి వాళ్ల పిల్లల్ని పనికి కాకుండా పాఠశాలకి పంపమని నచ్చజేప్పుదాం.
2.అనాధ పిల్లలకు అర్థరూపాయి ఇవ్వడంతో సరిపెట్టకుండా అనాధాశ్రమంలో చేర్పిద్దాం. అంతే కాకుండా మనకున్న దానిలో కొంత అనాదశ్రమాలకి విరాలమిద్దాం.
3.హోటళ్ళలో డబున్న వాళ్ల ఇళ్ళలో పని పిల్లలుగా పెట్టుకొని హింసించే వారిని బాల కార్మికుల చట్టం ప్రకారం శిక్షలు కలిగేలా చేసి ఆ పిల్లలను బడికి పోయేలా చేద్దాం.
నాకు తట్టిన ఆలోచనలు ఇవి. ఇంకా మీ మంచి మనసుతో ఆలోచించండి చాల పరిష్కార మార్గాలు దొరుకుతాయి.
శిర్షిక మీకు నచ్చిందని ఆశిస్తున్నాను
ఒకవేళ నచ్చితే దీనిపై మీ విలువైన అభిప్రాయాలూ, ఆలోచనలు కామెంట్ బాక్స్ లో వ్రాయండి

13, అక్టోబర్ 2009, మంగళవారం

మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం

పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని వేమన మహాకవి చెప్పిన మాటకు అర్ధం తెలియక పోయినా, కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించం ఎందుకంటే మన చదువులంత ఇంగ్లిష్మయంకధ " తన కోసం బ్రతికేవాడు మాములు మనిషి ఇతరులకోసం బ్రతికేవాడు మహానుబావుడు" అన్నాడో మహానుబావుడు. బిజీ లైఫ్ లో డబ్బు ఫై వున్న శ్రద్ద మరొక దాని ఫై లేదు, కాదంటారా? చివరికి తన గురించి తాను ఆలోచించడానికే టైం మిగల్చడంలేదు. దీనికికారణం అవసరానికి మించి డబ్బు సంపాదించాలనే ఆలోచన . ఒక్కసారి కుడా అవసరానికి మించిన డబ్బెండుకని, ఎవరు ఆలోచించడం లేదు ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో కదలినపుడు స్వర్ధమనే ముసుగుతో దాచిపెడుతున్నాము. ఎంతసేపు నేనుకాకుంటే నా కొడుకులు అనుబవిస్తారనే ఆలోచనే తప్ప, అసలా కొడుకులు సోమరిపోతులు కావడానికి వారు సంపాదించే మితిమీరిన డబ్బే అని ఎవరాలోచించడం లేదు .

ఒక్కసారి మీ మంచి మనసుతో ఆలోచించండి ఎందుకీ అసమానతలు, అందరం పుట్టింది అమ్మకడుపునుంచేగా కాని, కొందరికి తినడానికి తిండి దొరకడం లేదు మరికొందరికి తిన్న తిండి అరగాడంలేదు. మనిషిలో మానవత్వం కరువౌతుంది మనిషికి మృగానికి తేడా లేకుండా పోతుంది.

ఎక్కడో యుగోస్లోవియలో పుట్టిన మథర్ తెరీసా తన జీవితాన్ని మన దేశంలోని బీద ప్రజలకోసం దారపోసింది . కాని, మనం ఈ నేలపై పుట్టి కూడా కలలోకూడా 'సేవ' అనే మాటను స్మరించలేకపోతున్నాము. ఎన్ని కోట్లు సంపాదించినా మనము బ్రతికేది సగటు జీవితమే(60) కాని , పుర్నష్కులంకాలేముగా ఒక బిక్క్ష్హమెత్తుకునే వృద్ధురాలు వంద సంవ్చరాలు బ్రతకవచ్చు కోట్లు గడించి ముపై సంవ్చ్చారాలకే రాలిపోవచ్చు. మనం కొటిశ్వరులమైతే తాత్కాలికమైన కీర్తినిస్తుంది కాని మనం ఇతరులకు చేసే సహాయం మన జీవితన్తమేకాక మన జీవితనంతరముకూడా పూర్ణ యసస్సునిస్తుంది.

నా బ్లాగులో ఈ శిర్షిక చదివిన వారిని నేనోకటే కోరుతున్నాను మనము తినకుండా ఇతరులకు పెట్టకున్నా, కనీసం మనం తిన్న తరువాతైనా ఇతరులకు పంచిపెట్టుదాం . అప్పుడే కొంతవరకైనా ఈ ఆర్ధిక అసమానతలు కనుమరుగౌతాయి

చంద్రునికో నూలుపోగులా నా ఈ చిన్ని ప్రయత్నం ఈ శిర్షిక చదివినవారిలో చిన్ని మార్పును తెచ్చినా , నా ప్రయత్నం సఫలిక్రుతం అయినట్టేనని బావిస్తాను. తొలిసారిగా నేను చేసిన చిన్న ప్రయత్నంలో చిన్ని చిన్ని తప్పిదాలను పెద్దమనసుతో క్షమిన్చి అందులోని భావాన్ని మాత్రమే గ్రహించగలరు .

ఈ శీర్షికను విశ్వమాత మథర్ తెరీసాకు అంకితమిస్తున్నాను .

మీ.... రాంగోపాల్