నా బ్లాగుని శోధించండి


Home హస్యాంజలి Free Software links My Orkut My FaceBook కూడలి
రాంగోపాల్ బ్లాగుకి స్వాగతం...

1, డిసెంబర్ 2009, మంగళవారం

ఎయిడ్స్ కి చెబుదాం టాటా


ఎయిడ్స్ మన దేశాన్ని పీడిస్తున్న సమస్యల్లో యిది ఒకటి .20 సం. క్రితం ఎయిడ్స్ అంటే ఎరగని భారతదేశంలో ఇప్పుడు(మే 2005 నాటి లెక్కల ప్రకారం )1,09,349 మంది ఎయిడ్స్ మహమ్మారితో బాధపడుతున్నారు. అందులో 37% మంది 30 ఏళ్ళ లోపువారే, 31,982 మంది ఆడవారు. ఇవికాక నమోదు కాని కేసులెన్నో ఉన్నాయి. ఎయిడ్స్ బాధితుల్లో ఎక్కువ శాతం మంది ఆఫ్రిక ఖండంవారే. తరవాతి స్థానంలో మన భారతదేశం ఉంది. మన దేశంలో ఎయిడ్స్ బారిన పాడుతున్నవారి సంఖ్యా ఆంధ్రప్రదేశ్లో చాల త్వరగా వ్యాపిస్తుందని NACO చెబుతుంది. మన దేశంలో 10% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆధ్రప్రదేశ్లోనే ఉన్నారు.

పెద్దవాళ్ళు క్షనికావెశమ్లొ చేసిన తప్పుకి (ముఖ్యంగా మగవాళ్ళు ) అభం శుభం ఎరగని పసిప్రాణాలు భాదపడుతున్నాయి . మధ్య వయస్సులోనే తల్లిదండ్రులు మరణిస్తున్నారు. పుట్టుకతోనే చిన్నారులు ఎయిడ్స్ బారినపడటమేగాక, తల్లిదండ్రులులేని అనాధలౌతున్నారు .

ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా వున్నా దేశం చైనా , అభివ్రుద్దికాటంకం జనాభా ఎక్కువగా వుండటమని అన్ని దేశాలు నమ్ముతాయి . కాని, ఆ మాటని అనగత్రోక్కి అభివృద్ది విప్లవాన్ని శ్రుష్టిస్తుంది చైనా. చైనా అభివ్ర్ధధిని అంచనావేయడానికి చక్కని వుదాహరణ భీజింగ్ ఒలంపిక్స్. నిన్నటిదాక జనాబాలో ప్రధమస్థానంలో వున్నా చైనా రేపు ఆర్థికాభివ్రుధ్ధిలొ ప్రధమస్థానంలో వుంటుందనడంలో ఆచర్యపోనక్కరలేదు.

మన ప్రక్క దేశం చైనా అభివృద్ది విప్లవం జరుపుతుంటే, మన దేశం మాత్రం ఎయిడ్స్ విప్లవం జరుపుతుంది. విప్లవమనే ఉన్నతమైన మాటని ఎయిడ్స్ కి అనువదించటం తప్పేకావచ్చు కాని, అతి తక్కువ కాలంలో అతిపెద్ద మార్పుజరుగుతున్నదని చెప్పడానికి ఇంతకన్నా మంచి మాట లేదనేచేప్పాలి.మన దేశంలో ఎక్కువమంది ఎయిడ్స్ బారిన పడడానికి కారణం నిరక్షరాస్యత, అవగాహనరాహిత్యం మరియు భిధరికం.

ముంబాయ్ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో కొన్ని వీధులు పూర్తిగా సెక్స్ వర్కర్సుతో నిండిపోతున్నాయి. యువతులు ఈ ఉభిలోకిదిగడానికి ముఖ్యమైన కారణం భీధరికం. దారిద్రం అనుభవించే కుటుంబాలకి డబ్బు ఎరగా చూపి కొందరు దౌర్భాగ్యులు అభం శభం తెలియని అమ్మాయిల్ని కనీస వయస్సుకూడలేని చిన్నారుల్ని సెక్స్ వర్కర్సుగా మారుస్తున్నారు. కటిక దారిద్రంవల్ల కన్న తల్లిదండ్రులే స్వంత బిడ్డలను అమ్ముకునే పరిస్థితికి దిగజారుతున్నారు. ఈలాంటి దృశ్యాలు ఎక్కువగా గిరిజన తాండాల్లో చూస్తున్నాము.

సెక్స్ వర్కర్స్ ధగ్గరికోచ్చే విటుల్లో ఎక్కువమంది లారిడ్రైవర్లే. కుటుంబాలకి ఎక్కువకాలం దూరంగా ఉండటంవల్ల వీరు ఎక్కువగా రెడ్లైట్ ఎరియాలకి ఆకర్షితులౌతున్నారు. వారు చేసే తప్పుకి వారితో పాటు వారికుటుంబాలు కూడా నాశనమైపోతున్నాయి.

సరే ఇవన్ని మనకు తెలిసినవిషయలే. కాని, తెలిసినా మనమేమి చేస్తున్నాము? ఎయిడ్స్ బారిన పడిన వారిని మానసికంగా హింసించడంతప్ప. ఇది మనసున్నవాళ్ళు చేయాలిసిన పనికాదు. మనమొక్కరమే బాగుంటే చాలు అనుకోకుండా మనప్రక్కవాళ్ళు కూడా బాగుండాలని అనుకోవాలి. ఎవరో చేస్తున్న తప్పులకి మనమేమిచేయగలం అని అనుకుంటే ఏమి చేయలేము కాని,మనిషితలచుకుంటే అసాధ్యమైంది ఏది లేదు.

ఎయిడ్స్ అంటే నయంకాని జబ్బని చాలామందికి తెలుసు. కాని, ఎ ఎ కారణాలవల్ల ఎయిడ్స్ వస్తుందనేది కొద్ది మందికే తెలుసు. ఇక్కడే మన బాధ్యత మొదలౌతుంది. ఎయిడ్స్ రావడనికిగల కారణాలు, ఎయిడ్స్ రాకుండా నివారనమార్గలేంటి, ఒకవేళ పొరపాటున ఎయిడ్స్ బారిన పడినవారికి ఎలా చేయుతనివ్వాలి అనే విషయాలను
ప్రతి ఒక్కరికి తెలియజేయగలిగితే ఎయిడ్స్ బారిన పడే వారి సంఖ్య తగ్గుతుంది అంతే కాకా ఎయిడ్స్ బారిన పడిన వారు
నిరాదరణకి గురికారు.

మనం ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు, తప్పుడు పనులు చేసినవారే ఎయిడ్స్ బారిన పాడుతారు, ఎయిడ్స్ వల్ల జనాభా తగ్గుతుంది అని వెర్రిగా ఆలోచించేవారు ఒకటాలోచించాలి ఎయిడ్స్ కేవలం లైంగిక చర్యలవల్ల మాత్రమే వ్యాపించదు కలుషిత రక్తమార్పిడి, పరిశుభ్రంగాలేని సిరంజిలు మరియు బ్లేడ్లతో కూడా వస్తుంది. మనంకాని మన బందువులుకాని తప్పుడు పనులు చేయకున్నా,షేవింగ్ చేయించుకున్నపుడో,ఇంజక్షన్ చేయించుకున్నప్పుడో లేక పచ్చబొట్టు (టాటు) పోడిపించుకున్నపుడో పొరపాటున ఎయిడ్స్ బారిన పడవచ్చు . అప్పుడు ఎయిడ్స్ వల్ల తగ్గే జనాభాలో మనమొ మన బందువులో ఉండచ్చుగా అందుకే వెర్రిగా కాకుండా సేవాభావంతో ఆలోచించుదాం.

జనంలో మనమొక్కరమేకాదు జనంలో మనమొకరిమి మాత్రమే కదా. కనుక సాటివారికి సహాయ పడుదామనే ధృక్పదంతో ముందుకు సాగుతాం. ఎయిడ్స్ పై అందరికి అవగాహనా కలిగించి, ఎయిడ్స్ ని నివారించడంలో మనమూ ఒక సైనికుడౌధాం. ఎయిడ్స్ రహిత సమాజానికి దారి చూపిస్తామని మన మనసాక్షిపై ప్రమాణం చేదాం. సరేనా నా.. మంచి మిత్రులారా.

"ఇది వేదాంతం కాదు వాస్తవం "

ఎయిడ్స్ బారిన పడినవారికి ఈ వ్యాసాని అంకితమిస్తున్నాను

మీ.... రాంగోపాల్
నా బ్లాగ్ పై మీ అభిప్రాయాలు నాతో పంచుకోడానికి కామెంట్ బాక్స్ లో వ్రాయండి.









14, నవంబర్ 2009, శనివారం

నెహ్రూ జయంతి శుభాకాంక్షలు

చిన్నారులకు "బాలలదినోత్సవ మరియు నెహ్రూ జయంతి" శుభాకాంక్షలు

20, అక్టోబర్ 2009, మంగళవారం

పొగ'బారిన' హృదయాలు



"పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్ " ఈ వాక్యం వినగానే మనకు కన్యాశుల్కంలోని గిరీశం క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది.ఆనాడు గురజాడగారు అప్పటి సామాజికపరిస్తితులను కల్లకుకట్టినట్టుగా కన్యాశుల్కం నాటకంలో చూపించారు. ఆ నాటకం అప్పటి నుండి ఇప్పటివరకు ఎంతో పాపులర్. అలాగే పోగారయుల్లకి గిరీశం క్యారెక్టర్ కుడా అంతే పాపులర్, ఎంతగా అంటే తమను సమర్దించే వ్యక్తి తమవెంటే ఉన్నాడన్నంతగా కాని, ఒక్క విషయం సరదాగా పొగతో మేగాలు శ్రుష్టిస్తున్న పొగరాయుళ్ళు చివరికి పొగ వల్ల మేగాల్లో కలిసి పోయే రోజు వస్తుందని తెలిసి కూడా వారి సరదాని మార్చుకోవడానికి ఇష్టపడరు.

ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్పలకుంటున్నాను ఒక కుక్కగారు తిరిగి తిరిగి అలసిపోయి ఒక ప్రదేశంలో ఇనపమొలున్నది చూడకుండ కూర్చున్నదట మొల తనకు గ్రుచ్చుకున్న అక్కడినుండి లేవకుండ అక్కడే కూర్చున్నదట ఈ విషయాన్నీ గంటసేపటినుండి గమనిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఇలా అంటున్నాడు ఒరేయ్ గంటసేపటినుండి ఆ కుక్క మొలపైన కూర్చొని అరుస్తుందిగాని అక్కడినుండి లేవడంలేదు ఎందుకని? దానికి రెండో వ్యక్తి ఇలా చెపుతున్నాడు ఆ కుక్కగారికి మొలవల్లవచ్చేనోప్పి సరిపోవడం లేదురా దానికి సరిపడే నొప్పి రాగానే అదే అక్కడినుండి లేచిపోతుందిలే అన్నాడట. అలాగే పొగరాయుళ్ళు కూడా చిన్నప్పుడు పోగాత్రగే వాల్లనుచుసి సరదాగా పొగత్రాగడం అలవాటు చేసుకుంటారు. మొదట్లో దగ్గు వచ్చిన, కళ్లు తిరిగిన తీయని భాధగా భరిస్తారు. అలవాటుగా మారినప్పుడు ఇతరులు దానివల్ల కలిగే చేడు చెప్పినా గాని వినిపించుకోరు. అలవాటు ముదురి ఉపిరితిత్తుల క్యాన్సుర్గా మారితే గాని వారికీ తెలియదు. కుక్క గారి నొప్పిలగా.
బస్సులో, సినిమాహలల్లో, రైల్వేస్టేషన్లలో ఇంకా, ఇతర ప్రాంతాలలో పొగత్రాగరాదు అనే స్లోగన్ చూసి అలవాటు లేని వారేమో ఇక్కడ పొగత్రాగడం నిషిద్దం అనుకుంటారు. కాని, అలవాటు ఉన్నవారు కాలిగా ఎందుకు ఉన్నావు పొగత్రాగరాదు అనుకుంటారేమో తెలియదు గాని ఎదేచ్చగా సిగరెట్టో, బీడియో జేబులోంచి తిసి అంటించి గుప్పు గుప్పుమని చిన్నపిల్లలు, ఆడవాళ్ళని కూడా చూడకుండా వారిపైకి పొగ ఉదుతారు. కాని వారికి తెలుసు పోగాత్రగే వారికన్నా దానిని పీల్చుకున్న వారిపైనే ఎక్కువ ప్రబావం చూపిస్తుంది. అయినా వారి సరదా వారిదే. ఎవరైనా వద్దని సలహా ఇస్తే చెప్పేవారికి వినేవాడు లోకువ అని సమర్దించుకుంటారు.
కాని
వారు కాల్చేది పొగాకు గొట్టం కాదు, వారి ఆయుషు అని గుర్తుంచుకోవాలి. పోయేది తమ ప్రాణమేననివెర్రిగా అనుకోకుండా వారిపైన ఆధారపడే బార్య బిడ్డలు అనాధలౌతారని గుర్తుంచుకోవాలి.

సిగరెట్టు
, బేడీలు వాటి తమ్ముళ్ళు (గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు) స్లో ఫాయిజన్ లాంటివి. మెల్లగా మెల్లగా వాటిని ఉపయోగించే వాళ్ళే గుర్తించకుండా వారి ఆరోగ్యాన్ని హరిస్తాయి. ఎ అలవాటు లేని వారు కూడా అన్ని చేడు అలవాట్లు ఉన్నా వారికన్నా ముందే పోవచ్చు. వాళ్ళను చూపించి మన చెడుఅలవాట్లను సమర్తించుకొని జీవితాన్ని అన్ని విధాల ఆస్వదిస్తమనుకుంటే మనం చదివే చదువులకు అర్థంలేనట్టే ఎందుకంటే పుట్టిన ప్రతివాడు పోయేవాడే అలాగని వున్నదంతా తినలేముగా ఎంతో కొంత రేపటి కోసం దాచుకుంటాం. అలాగే ఆరోగ్యాన్ని కూడా రేపటి కోసం కాపాడుకుంటే తప్పేముంది.
సినిమాల్లో క్లైమాక్సులో పోలిసుల్లా మన ప్రభుత్వం మొదట పొగాకు ఉత్పత్తి కంపెనిలకు అనుమతి ఇచ్చి, ఇప్పుడు పుర్రె, తెలు బొమ్మలతో ప్రజల్లో పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రచారం చేస్తుంది. ప్రజలపై అంత మమకారం ఉన్నా ప్రభుత్వం ఎందుకు మొదట పొగాకు ఉత్పత్తులకు అనుమతి ఇచ్చారు? ఇప్పుడు చేతులు కాలాక పుర్రెలు ఎందుకు పట్టుకోవాలి. ఏధి ఏమైన ఇప్పటికైనా కళ్లు తెరచిన పాలకులకు మన అభినందనలు తెలుపుదాం.

భీడి
కొందరి ఆయుషు తగ్గిస్తుంటే మరికొందరు బీదభీడి కార్మికుల ఆకలి తీర్చి అయిషుపెంచుతుంది వారికదే జీవనోపాధి. అందువల్ల పోగాకుపై మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నముందుగా బీద బీడీ కార్మికుల జీవనోపాధికి ఇతర మార్గాలు చూపిన తర్వాతే పుర్రె గుర్తుపై ప్రయోగాలు చేయాలనీ ఆశిద్దాం.

14, అక్టోబర్ 2009, బుధవారం

బాల కార్మికులు

స్వాతంత్ర్యం షష్టి పూర్తి చేసుకున్న మనం మాత్రం పసిపాపలను బాలకార్మికులుగా చూస్తున్నాము, మారుస్తున్నాము.బ్రిటిష్ వాళ్ల నుండి స్వేచ్చ పొందామే గాని, పసిపిల్లలకు స్వేచ్చ ఇవ్వలేకపోతున్నాము. 60వత్సరాల స్వేచ్చ వాయువులు పిలుచుకున్నభారతావనిలో స్వేచ్చ అంటే ఎరగని చిన్నారులను చూస్తున్నాం.
దేవుని గుడిలో దండం పెట్టి బయట కనిపించే చిన్నారులకి రూపాయో అర్ధరూపాయో చేతిలో పెట్టి "కిలో పాపం" కదిగెసుకున్తునామ్ అనుకుంటున్నమేగాని, ఆ పిల్లలు ఆకలి భాధ భరించలేక బాల కర్మికులుగాను, ఆకాస్త పని కూడా లేనప్పుడు చేయిచాచి అర్దించే చిట్టి చేతులను పొద్దున లేచినప్పడినుంచి, నిద్ర పోయేవరకు స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావులు పుట్టిన ఈ గడ్డపైన చూస్తూ మౌనంగా ఉంటున్నాం.
కారణం, ఒకే ఒక్క ప్రశ్న నకెందుకులే?
ఔను! ఇదే ప్రశ్న స్వరాజ్యం కోసం పోరాడిన గాంధీ మహాత్మునికో, మన తెలుగువాడు అల్లూరి సీతారామరాజుకో, ఇంకా ఎందరో మహానుభావులకో వచ్చి ఉంటే ఇవాళ మన నేలపైనే మనమందరం భానిసలుగా ఉండేవాళ్ళం. భానిస సంకేల్లనుండి విముక్తి పొందిన మనం, బాల కార్మికులకు మాత్రం విముక్తి ప్రసాధించలేకపోతున్నాం. అల ఆలోచిస్తే దినిని నివారించడం మనకు పెద్ద సమస్యేమీ కాదు,నివారించాలని ఆలోచించకపోవడమే మనం చేస్తున్న ఆలస్యం.
మనలో కొందరు అనుకోవచ్చు నా ఒక్కడి వల్ల ఏమౌతుందని కానీ, ఒక్కొక్క చుక్క నీరు కలిస్తేనే సముద్రమౌతుందని మనందరికీ తెలిసిన విషయమే, విషయాన్నీ మరొక్కసారి గుర్తు చేసుకుంటే నా వల్ల ఎమౌతుందన్న ఆలోచన రాదు.
భారతమాత భిడ్డలారా నాతోబుట్టువులార మనమందరం కలిసి మన ప్రయత్నం ఈ రోజు నుండే ప్రారంభిద్దాం

ఇప్పుడు
బాల కార్మికులుగా మారడానికి గల కారణాలు ఆలోచిద్దాం.
1.అతి ముఖ్య కారణం పేదరికం:- రెక్కాడితే గాని డొక్కాడని భిద కుటుంభాలలో బార్యబర్తలు కష్టం వారి కుటుంబ కనీసఅవసరాలకు చాలక వారి పిల్లలను లేత వయసులోనే పాఠశాలకి బదులు పనికి పంపి బాల కార్మికులుగా కన్నాతల్లిధన్రులె మరుస్తునారు. విషయాన్నీ చూస్తే చెట్టు ఆకులను తెంపి చెట్టుకే ఎరువుగా వేసినట్టుంది కదా!
2. అనాథ పిల్లలు:- కామంతో కొవ్వెక్కిన ' ఒక మగ ఒక ఆడ' చేసిన తప్పుకి చెత్త కున్దిలనే తల్లిగా ఇల్లుగా మార్చుకున్న పిల్లలు బాల కార్మికులుగానో, ముష్టి పిల్లలుగానో, దొంగలుగానో మారుతున్నారు. ఇంకా మనం గ్రహించని కారణాల వల్ల కూడా "" అంటే అమ్మ, "" అంటే ఆవు అని పలకాల్సిన నోటితో "" అంటే అన్నం "" అంటే ఆకలి అని పలకాల్సివస్తుంది.
ఐతే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మనమేమి చేద్దామంటే :-
1.మన చుట్టూ కనిపించే భిద కుటుంభాలకి చేతనైన సహాయం చేసి వాళ్ల పిల్లల్ని పనికి కాకుండా పాఠశాలకి పంపమని నచ్చజేప్పుదాం.
2.అనాధ పిల్లలకు అర్థరూపాయి ఇవ్వడంతో సరిపెట్టకుండా అనాధాశ్రమంలో చేర్పిద్దాం. అంతే కాకుండా మనకున్న దానిలో కొంత అనాదశ్రమాలకి విరాలమిద్దాం.
3.హోటళ్ళలో డబున్న వాళ్ల ఇళ్ళలో పని పిల్లలుగా పెట్టుకొని హింసించే వారిని బాల కార్మికుల చట్టం ప్రకారం శిక్షలు కలిగేలా చేసి ఆ పిల్లలను బడికి పోయేలా చేద్దాం.
నాకు తట్టిన ఆలోచనలు ఇవి. ఇంకా మీ మంచి మనసుతో ఆలోచించండి చాల పరిష్కార మార్గాలు దొరుకుతాయి.
శిర్షిక మీకు నచ్చిందని ఆశిస్తున్నాను
ఒకవేళ నచ్చితే దీనిపై మీ విలువైన అభిప్రాయాలూ, ఆలోచనలు కామెంట్ బాక్స్ లో వ్రాయండి

13, అక్టోబర్ 2009, మంగళవారం

మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం

పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని వేమన మహాకవి చెప్పిన మాటకు అర్ధం తెలియక పోయినా, కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించం ఎందుకంటే మన చదువులంత ఇంగ్లిష్మయంకధ " తన కోసం బ్రతికేవాడు మాములు మనిషి ఇతరులకోసం బ్రతికేవాడు మహానుబావుడు" అన్నాడో మహానుబావుడు. బిజీ లైఫ్ లో డబ్బు ఫై వున్న శ్రద్ద మరొక దాని ఫై లేదు, కాదంటారా? చివరికి తన గురించి తాను ఆలోచించడానికే టైం మిగల్చడంలేదు. దీనికికారణం అవసరానికి మించి డబ్బు సంపాదించాలనే ఆలోచన . ఒక్కసారి కుడా అవసరానికి మించిన డబ్బెండుకని, ఎవరు ఆలోచించడం లేదు ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో కదలినపుడు స్వర్ధమనే ముసుగుతో దాచిపెడుతున్నాము. ఎంతసేపు నేనుకాకుంటే నా కొడుకులు అనుబవిస్తారనే ఆలోచనే తప్ప, అసలా కొడుకులు సోమరిపోతులు కావడానికి వారు సంపాదించే మితిమీరిన డబ్బే అని ఎవరాలోచించడం లేదు .

ఒక్కసారి మీ మంచి మనసుతో ఆలోచించండి ఎందుకీ అసమానతలు, అందరం పుట్టింది అమ్మకడుపునుంచేగా కాని, కొందరికి తినడానికి తిండి దొరకడం లేదు మరికొందరికి తిన్న తిండి అరగాడంలేదు. మనిషిలో మానవత్వం కరువౌతుంది మనిషికి మృగానికి తేడా లేకుండా పోతుంది.

ఎక్కడో యుగోస్లోవియలో పుట్టిన మథర్ తెరీసా తన జీవితాన్ని మన దేశంలోని బీద ప్రజలకోసం దారపోసింది . కాని, మనం ఈ నేలపై పుట్టి కూడా కలలోకూడా 'సేవ' అనే మాటను స్మరించలేకపోతున్నాము. ఎన్ని కోట్లు సంపాదించినా మనము బ్రతికేది సగటు జీవితమే(60) కాని , పుర్నష్కులంకాలేముగా ఒక బిక్క్ష్హమెత్తుకునే వృద్ధురాలు వంద సంవ్చరాలు బ్రతకవచ్చు కోట్లు గడించి ముపై సంవ్చ్చారాలకే రాలిపోవచ్చు. మనం కొటిశ్వరులమైతే తాత్కాలికమైన కీర్తినిస్తుంది కాని మనం ఇతరులకు చేసే సహాయం మన జీవితన్తమేకాక మన జీవితనంతరముకూడా పూర్ణ యసస్సునిస్తుంది.

నా బ్లాగులో ఈ శిర్షిక చదివిన వారిని నేనోకటే కోరుతున్నాను మనము తినకుండా ఇతరులకు పెట్టకున్నా, కనీసం మనం తిన్న తరువాతైనా ఇతరులకు పంచిపెట్టుదాం . అప్పుడే కొంతవరకైనా ఈ ఆర్ధిక అసమానతలు కనుమరుగౌతాయి

చంద్రునికో నూలుపోగులా నా ఈ చిన్ని ప్రయత్నం ఈ శిర్షిక చదివినవారిలో చిన్ని మార్పును తెచ్చినా , నా ప్రయత్నం సఫలిక్రుతం అయినట్టేనని బావిస్తాను. తొలిసారిగా నేను చేసిన చిన్న ప్రయత్నంలో చిన్ని చిన్ని తప్పిదాలను పెద్దమనసుతో క్షమిన్చి అందులోని భావాన్ని మాత్రమే గ్రహించగలరు .

ఈ శీర్షికను విశ్వమాత మథర్ తెరీసాకు అంకితమిస్తున్నాను .

మీ.... రాంగోపాల్

30, సెప్టెంబర్ 2009, బుధవారం

ర్యాగింగ్ రాక్షసి



ఒకప్పుడు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్లో భయాన్ని భిడియాన్ని పోగొట్టటానికి సీనియర్స్ జునియర్సని సరదా సరదా మాటలతో వారికిచేరువై స్నేహితులుగామారడానికి పుట్టిన ర్యాగింగ్, రానురాను రాక్షస చేష్టలుగ మారింది.
ఒక మనిషిని హింసించి ఇంకొకమనిషి ఆనందం పొంధటాన్ని మానసిక వైద్యుల భాషలో చెప్పాలంటే "శాడిజం" అంటారు. కాని మన కాలేజీలలో దానికి వేరే పేరుంది అదే ర్యాగింగ్.
శత్రుదేశ సైనికులు యుద్ధ ఖైదీలుగా దొరికినపుడు(పూర్వపు రాజుల కాలంలో ఇప్పుడు కొన్ని దేశాలలో ) వారిని భానిసలుగా మార్చి హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతారు. ఆ దృశ్యాలు ఎప్పుడైనా మనం టేవిలో చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి. అంత సున్నితమైన మనసున్న మనుషులున్న మన భారతదేశంలో కొన్ని కాలేజీలలో ర్యాగింగుతో ఒక మనిషి ప్రాణాలు తిసుకోనేలా హింసించే స్టూడెంట్స్ ఉన్నారంటే మనం ఎంత సిగ్గుపడాలి.
చదువుల్లోను, వయసులోనూ పెద్దవారైన లేక్టురర్స్కి నమస్కరించడానికి మొహమాటపడే విధ్యార్థులు ఒక్క సంవత్సరం ముందు కాలేజిలి అడుగు పెట్టినంత మాత్రాన సీనియర్స్ వారి తర్వాత వచ్చే జునియర్సుని సెల్యూట్ చేయమని క్యన్టేంకి
పోవద్దని ముర్కంగా తల తోక లేని విషయాలతో తోటి స్టూడెంట్స్ని హింసించడం ఎంత ముర్కంగా ఉంటుందో ఆలోచించండి!
బట్టతల, షుగర్ ఇంకా జన్యు సంబంధమైన జబ్భులు వంశపారంపర్యంగా వస్తాయి. అలాగే ర్యాగింగ్ కాలేజీలలో సీనియర్స్ నుండి జునియర్సుకి పాకుతుంది.
సీనియర్స్ చేసే ర్యాగింగ్ జునియర్స్లో తట్టుకున్న వారు సీనియర్ స్టూడెంట్స్ అయిన తర్వాత వారి తర్వాత వచ్చే జూనియర్స్ పైన రివేంజు తిర్చుకున్తునారు. ర్యాగింగ్ తట్టులేని సున్నిత మనస్కులు కాలేజి మానుకోవడమో, ఆత్మహత్య చేసుకోవడమో చేస్తున్నారు. ర్యాగింగ్ భారిన పడేవాళ్ళు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని మరియు భీద, మధ్యతరగతి కుటుంబాల్లోని యువతి, యువకులు ఎక్కువగా ఉన్నారు.
ర్యాగింగ్ చేసే వారిలో ఆడవాళ్ళు కూడా ఉన్నారంటే, మనదేశం చదువులో ముందుకేల్ల్తు సంస్కారంలో వెనక్కి వెళ్తుందని అనుకోవాలి. చదువుతో పాటు సంస్కారం నేర్పే లెక్చరర్స్ చూసి చూడనట్టుగా ఉంటున్నారు. ర్యాగింగ్ జరిగి ఆత్మహత్యల వరకు వెళ్ళిన తర్వాత కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించే బదులు అసలు ర్యాగింగ్నే నివారిస్తే కాలేజి యాజమాన్యాల సోమ్మేమిపోతుందో అర్ధంకాదు.
ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వం ర్యగింగ్పై కటిన చర్యలు తీసుకొంటుంది. అందుకు మన ప్రభుత్వాని ఎంతగానో ప్రసంసించాలి. ర్యాగింగ్ రాక్షసి ప్రభుత్వం విధించే శిక్షలో ఇంకా ఎవరో ఏమో చేస్తే పూర్తిగా అంతరిస్తుంతన్కోవడం మన భ్రమే ర్యాగింగ్ పూర్తిగా అంతరించాలంటే ప్రతి ఒక స్టూడెంట్ ర్యాగింగ్ అంటే పైశాచిక ఆనందమని గుర్తించాలి. తోటి స్టూడెంట్స్ జూనియర్స్ అయినా, సీనియర్స్ అయినా విద్యనుs ఆర్జించడానికేవచ్చామని గుర్తించి స్నేహభావంతో కలిసుండి మనదేశ ఖ్యాతిని పెంచాలని ప్రతి ఒక్క స్టూడెంట్ ని కోరుతున్నాను.

17, సెప్టెంబర్ 2009, గురువారం

అమ్మ

సృష్టిలో తియ్యని పదం అమ్మ. తల్లి స్పర్శ తెలియని మనిషి ఉండడు. ఆ మాటకు వస్తే తల్లి స్పర్శ తెలియని జివి ఈ సృష్టిలోనే లేదు . పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ అని ఓ కవి రాసిన పాటలో ఎంత మాధుర్యం ఉంది. అమ్మ అని తెలుగులో పిలిచినా మమ్మీ అని ఆంగ్లంలో పిలిచినా మాత అని హిందిలో పిలిచినా ఏ భాషలో పల్కిన ఆ మాట వెనుక ఉన్నా ఒకే ఒక అర్ధం అమ్మలోని కమ్మదనం.
చిన్నప్పుడు మా భామ్మ చెప్పేది డిల్లికి రాజైన తల్లికి కొడుకేనని దాని అర్ధం ఏంటే భామ్మఅని నేనడిగితే తననేది కొడుకు ఎంత పెద్ద వాడైన కన్న తల్లికి కొడుకుపై ఉన్నా ప్రే తగ్గదని, ఆ విషయం నిజమని ప్రతి ఒక్కరికి స్వానుబవమే.

కానీ నాకు ఒకే సందేహం మన రూపం తెలియని నాటి నుండి మనం ప్రపంచంలో ఒకరిగా గుర్తించేవరకు తన ప్రేమతో పెంచిన తల్లికి మనమేమిస్తున్నామని, నిజంగా ఆలోచించండి ఎంతమంది పెద్దయ్యాక కన్న తల్లిదండ్రుల్ని ఆదరిస్తున్నారు. తల్లికి మనపై ఉన్నా ప్రేమ మనకు ఆమెపై ఉండిఉంటే ఈ వృద్ధాశ్రమాలు (Old age homes) ఉండి ఉండవా.
బార్య పెళ్ళికి ముందు చదువుందా రూపం బాగుందా తనను పోషించగలాడ ఇంకా సవాలక్ష్య ఆలోచించి పెళ్లి చేసుకుంటుంది బర్త కూడా తనకిష్టమైన వారినే బార్యగా ఎంచుకుంటాడు కాని తల్లి అలాకాదు అసలు తన బిడ్డ రూపం ఆడ,మగ అని కూడా తెలియదు ఐన తొమ్మిది నెలలు సంతోషంగా తన గర్భంలో మోసి పుట్టిన భిడ్డ ఆడైనా, మగైనా కాలు, చేయి వంకరున్న ప్రేమతో తన స్తన్యమిచ్చి పెంచి పెద్దవాళ్ళని చేస్తుంది. అలాంటి అమ్మకు మనమిచ్చదేంటి పుట్టకముంద అమ్మ కడుపులో తన్ని పుట్టాకా అమ్మ పాలు తాగి అల్లరి చేసి చివరికి అమ్మకు గుప్పెడు మెతుకులు పెట్టలేక వృద్ధాశ్రమానికి పంపుతున్నాం ఇధన అమ్మకు మనమిచ్చే బహుమతి చచ్చాక తల కొరివితో తల్లి ఋణం తీరిందని తలనీలాలిస్తే సరిపోతుందా, బతికున్న తల్లికి ప్రేమతో పిడికెడు మెతుకులు పెడితే ఆ తల్లి హృదయం ఎంత సంతోషపడుతుంది.
పాత విషయమే ఐన మనమందరం గుర్తుంచుకోవలసిన విషయం ఇవ్వాటి కూతుళ్ళు, కోడల్లే రేపటి తల్లులు అలాగే ఇవ్వాటి కొడుకులే రేపటి తండ్రులని గుర్తుంచుకోవాలి. మనం మన తల్లిదండ్రులపై చూపిన చిత్కారాలు రేపో, మాపో మన పిల్లల నుండి ఎదురైతే అప్పుడు మన పరిస్థితి ఆలోచించండి. ఆలోచించడానికే బయమేస్తుంది కదు, మరెండుకాంది మనకి స్వార్ధం ఇద్దరు కలిస్తే పుడతము నలుగురుమొస్తే పోతాము మధ్యలో స్వార్ధాన్ని selfishness అని ఆంగ్లంలో అందంగా చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం ఇది ఎంత మూర్ఖంగా ఉంది.
ప్రేమను ప్రేమతో ప్రేమించి ప్రేమను పంచి మనమూ ప్రేమలోని నిజమైన ప్రేమని ఆస్వదిస్తమా.
"మే రోండవ ఆదివారం mother's day సందర్బంగా ప్రపంచంలోని తల్లులందరికి శిర్షిక అంకితమిస్తున్నాను"
సరే ఇక సెలవు .
మీ..
రాంగోపాల్



శిర్షిక మీకు నచ్చితే, మీ కామెంట్ని కామెంట్ బాక్స్ లో వ్రాయండి